మద్యం ఆరోగ్యానికి హానికరం. మద్యం మిమ్మల్ని.. మీ కుటుంబాల్ని నాశనం చేస్తుందని ప్రతి సినిమా కి ఆరంభ విజువల్ లో ఏ రేంజ్ లో క్లాస్ తీస్కుంటారో తెలిసిందే. సినిమాలో సన్నివేశమే అయితే జనాలు ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సినిమా ప్రారంభానికి ముందు కాబట్టి జనం చెవికెక్కించుకుంటారని హీరోలు తమ వాయిస్ వినిపిస్తుంటారు. అలా చాలాసార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన జననేతగా, ప్రజా సేవకుడిగా జనాల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాల ద్వారా సందేశాలిస్తే ఎవరూ వినరని పవన్ స్వయంగా రంగంలోకి దిగి రాజకీయాలు చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది.
మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అమలు చేస్తున్న తీరుపై ఆయన ఎందుకని విమర్శలు చేస్తున్నట్లు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరం. జగన్ గద్దెనెక్కిన నాటి నుంచి పవన్ .. జనసేనాని హోదాలో తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పవన్ చేసిన విమర్శల్లో ఓ అర్ధం కూడా ఉంది. అయితే మద్య నిషేధంపై మాత్రం పవన్ నోరు ఎందుకు మెదపనట్లు? దఫదఫాలుగా మద్యం నిషేధం జరుగుతుందని జగన్ ముందే చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో తాజా పరిస్థితులపై.. వైకాపా ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేస్తోన్న విమర్శలే అహేతుకంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైకాపా మద్యం ధరలు అమాంతం పెంచడం తప్పే అనుకున్నా! మద్యం నిషేధం విషయంలో జగన్ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవనుకున్నా! పవన్ కళ్యాణ్ ఎందుకని ఈ సమయంలో తాగుబోతులను మందు మానేయండని నేరుగా చెప్పలేకపోతున్నారు? పవన్ తాజా వైఖరి చూస్తుంటే రాజకీయం తప్ప అందులో ఎక్కడా మచ్చుకు కూడా ఆయన లో నిజాయితీ కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. విమర్శలు మానేసి ప్రజలకేమైనా ఆయన నాలుగు మంచి మాటలు చెబితే ఎందుకు వినరంటూ అభిప్రాయపడుతున్నారు. కనీసం అందరూ మద్యం మానకపోయినా…ఆయన అభిమానులైనా మాట విని ఛాన్స్ ఉందని అంటున్నారు.
అవన్నీ మానేసి జగన్ పాలనపైనే విమర్శలు చేసేందుకు మాటు వేయడం ఎంత వరకూ సబబు అంటూ పవన్ తాజా వ్యాఖ్యలపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు. ఇక మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేసే కుళ్లు రాజకీయాల గురించి ఎవరికి తెలియదు. ఆయన కుర్చుంటే రాజకీయం…నుంచుంటే రాజకీయం…చివరికి దగ్గినా…తుమ్మినా కూడా రాజకీయమే. అలాంటింది కరోనాపై ఇంకెన్ని రాజకీయ రంకెలేస్తారో చెప్పాల్సిన పనిలేదంటూ ఆయన వ్యతిరేక వర్గం విమర్శిస్తోంది.
