ఏపీలో ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్ని టికెట్ల కేటాయింపు పై బిజిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వలసలు కూడా భారీగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ) వైసీపీ కండువా కప్పుకున్నారు. లోటస్ పాండులోని వైసీసీ కార్యాలయంలో జగన్ తో భేటి అయిన అనంతరం ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ బాబ్జీని కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనకు పాలకొల్లు టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
వైసీపీలో చేరిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బాబ్జీ
