జేపీ నడ్డాకు ఏపీ జనాల కౌంటర్స్ మామూలుగా లేవు!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని ప్రస్తుతం తెలంగాణ, ఏపీలపై దృష్టి పెట్టిన బీజేపీ పెద్దలు… తాజాగా శ్రీకాళహస్తిలో ఒక బహిరంగ సభను ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా సభావేదికపై జేపీ నడ్డా ఇచిన స్పీచ్ కు ఏపీ జనాలు ఆన్ లైన్ వేదికగా కౌంటర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్ గా మారాయి.

ఏపీ సర్వనాశనం అయిందని చెబుతున్నారు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా! శ్రీకాళహస్తి లో జరిగిన బీజేపీ సభలో మైకందుకున్న నడ్డా… వైసీపీ ప్రభుత్వం మీద గట్టిగానే మాట్లాడారు. ఏపీకి రాజధాని లేదు అని.. ఏపీని అభివృద్ధి కాకుండా చేశారని ఫైరయ్యారు. ఏపీలో లిక్కర్ స్కాం జరుగుతోందని, ల్యాండ్ స్కాం జరుగుతోందని జేపీ నడ్డా విమర్శించారు.

నరేంద్ర మోడీ ఏపీకి వచ్చి రాజధానికి శంకుస్థాపన చేసినా అడుగు ముందుకు కదలదేని నడ్డా ఆరోపించారు. దీంతో… ఆనాడు ఉమ్మడి ప్రభుత్వంలో కూడా కేవలం మట్టీ నీళ్ళు మాత్రమే ఇచ్చి పోయారనేది నాడు టీడీపీ కూడా ఆరోపించిన విషయాన్ని మరిచినట్లుగా జేపీ వ్యాఖ్యలు ఉన్నాయని జనం ఫైరవుతున్నారు.

ఇదే క్రమంలో… ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని నడ్డా అంటున్నారు. అవినీతి చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా అన్నది జనం నుంచి వస్తున్న ప్రశ్న. అదేవిధంగా… ఏపీకి ఎంతో మేలు చేశమని నడ్డా చెప్పుకొస్తున్నారు. దీంతో… గతంలో చంద్రబాబుతో కలిసి అటకెక్కించిన “ఏపీకి ప్రత్యేక హోదా” అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ఏపీ జనాలు. ఇదే సమయంలో నిత్యం ఉండవల్లి చెప్పే విభజన హామీలపట్ల ఇప్పటికీ బీజేపీ పెద్దలు మౌనంగానే ఉన్నారన్న విషయం నడ్డాకు వివరిస్తున్నారు జనాలు!

ఇదే ఫ్లోలో…. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ని ముంచుతూ మరో వైపు ఏపీకి చలా చేశామని, చేస్తున్నామని చెబుతుండటంపై నడ్డాను ఆన్ లైన్ వేదికగా ఆడుకుంటున్నారు ఏపీ జనాలు. మరి ఈ విషయాలను బీజేపీ పెద్దలు గమనిస్తారా? ఏపీకి బీజేపీ నాడు నేడు కూడా అన్యాయం చేసిందనే విషయం ప్రజల్లో బలంగా ఉందని గుర్తిస్తారా? ఫలితంగా విభజన చట్టంలోని హామీలు నెరవేరుస్తారా? లేక, దక్షిణాదిలో దారులు మరింత మూసుకుంటారా అనేది వేచి చూడాలి.