జగన్ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం… ఇది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఒక వరం లాంటిదే !

ap government reduce tution fees to 70 percent in colleges

ఆంధ్ర ప్రదేశ్ : ఏపీ ప్రభుత్వం కళాశాలల్లో ఫీజులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. ట్యూషన్‌ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ap government reduce tution fees to 70 percent in colleges
ap government reduce tution fees to 70 percent in colleges

ఇదిలా ఉంటే రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. నవంబర్-23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.