రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టిన ఏపీ ప్రభుత్వం

2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2.2677.53 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో రైతుల కోసం సరికొత్త పథకాన్ని మంత్రి ప్రకటించారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 5 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా రైతాంగానికి అప్పటికప్పుడు కేటాయింపులు చేసే అవకాశం ఉంది.

వివిధ రంగాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఇవే

 వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు

బీసీ వెల్ఫేర్‌ రూ.8,242

అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు

ఉన్నత విద్య- 3,171 కోట్లు

ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రూ.5,473

సెకండరీ ఎడ్యుకేషన్‌ రూ. 22,783

పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు

ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు

సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117

వైద్యారోగ్యశాఖకు రూ. 10,032

హోంశాఖకు రూ.6,397 కోట్లు

గృహనిర్మాణశాఖకు రూ.4079

జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు

పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు

ఐటీకి 1006 కోట్లు

కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు

న్యాయశాఖకు 918 కోట్లు

అసెంబ్లీకి 149 కోట్లు

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు

మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు

ప్లానింగ్‌కు 1403 కోట్లు

పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 35,182 కోట్లు

రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ 172 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ 458 కోట్లు

సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు

రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు

మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు

యువజన క్రీడలు రూ. 1982 కోట్లు

చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు

డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు

క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు

ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు

యాంత్రీకరణకు రూ. 300 కోట్లు

మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు

ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు

ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు

బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు

మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు

పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు

బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు

ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు

చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు

అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు

చేనేతలకు రూ. 225 కోట్లు

9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు

చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు

చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు

మైనార్టీలకు దుల్కన్‌ పథకం కింద రూ. 100 కోట్లు

ఎన్టీఆర్‌ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు

పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు