వీడియో: కోల్‌క‌త చేరుకున్న చంద్ర‌బాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం రాత్రి ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌కత‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కులు విమానాశ్ర‌యంలో సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కోల్‌క‌త‌లోని బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగే `యునైటెడ్ ఇండియా` ర్యాలీలో చంద్ర‌బాబు పాల్గొంటారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడ‌గ‌ట్ట‌డానికి తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈ ర్యాలీని నిర్వ‌హించ‌బోతున్నారు. ఇందులో పాల్గొన‌డానికి ఇప్ప‌టికే దాదాపు అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు కోల్‌క‌తకు చేరుకున్నారు. ర్యాలీ అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ‌లో వారు ప్ర‌సంగిస్తారు.