ఏపీ బడ్జెట్ 2023-24 కేటాయింపుల వివరాలు!

ఆంధ్రప్రదేశ్ లో 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.31,061కోట్లు. పోతన పద్యం – రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన బుగ్గన… ఈ బడ్జెట్ లో సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామని తెలిపారు.

2023 బడ్జెట్‌ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక‍- రూ.21,434.72 కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు

జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు

జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు

వైఎస్సార్‌ ఆసరా-రూ.6700 కోట్లు

వైఎస్సార్‌ చేయూత-రూ.5000 కోట్లు

అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

వైఎస్సార్‌- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు

రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు

జగనన్న చేదోడు-రూ.350 కోట్లు

వైఎస్సార్‌ వాహనమిత్ర-రూ.275 కోట్లు

వైఎస్సార్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు

మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ-రూ.50 కోట్లు

రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు

లా నేస్తం-రూ.17 కోట్లు

జగనన్న తోడు- రూ.35 కోట్లు

ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు

వైఎస్సార్‌ కల్యాణమస్తు-రూ.200 కోట్లు

మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు

మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు

జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు

పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 1,166 కోట్లు

యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు

షెడ్యూల్‌ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు

షెడ్యూల్‌ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు

వెనుకబడిన తరగతుల సంక్షేమం- రూ. 38,605 కోట్లు

కాపు సంక్షేమం- రూ.4,887 కోట్లు

మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు

పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు

రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు

నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు

పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు

ఎనర్జీ- రూ.6,456 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు

గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు