ప్రమాదానికి గురైన యాంకర్ రష్మీ కారు… వ్యక్తి పరిస్థితి విషమం

ప్రముఖ యాంకర్ రష్మీ కారు ప్రమాదానికి గురైంది. యాంకర్ రష్మీ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢికొట్టింది. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్న పాలెంలో జరిగింది.

రష్మీ ఇటీవల కొత్త కారు కొనుక్కుంది. దానిలో ఆమె విశాఖకు వెళుతుండగా ఆదివారం రాత్రి 11గంటల సమయంలో కారు ప్రమాదానికి గురైంది. గాయపడిన వ్యక్తిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనే దాని పై స్పష్టత లేదు. ఈ సమయంలో కారును రష్మీ డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.