రోజా ప్లేస్‌ లో భువ‌నేశ్వరి, బ్రాహ్మణి పేర్లు… ఆనంకు గూబ గుయ్!

ఈమధ్యకాలంలో సంస్కారం విడిచిన నేతలు, విజ్ఞత కోల్పోయిన నాయకులు, ఏమత్రం ఇంగితం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసి భ్రష్టుపట్టించేస్తున్న సంగతి తెలిసిందే. మనం మాట్లాడే మాటలు పదిమంది వింటారు.. అవి ఆదర్శంగా ఉండాలే తప్ప అభ్యంతరకరంగా, అసహ్యంచుకునేలా ఉండకూడదనే సంస్కారం కోల్పోతున్నారు. వీరిలో నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం ఒకరు!

ఆనం వెంకటరమణారెడ్డి నోరు తెరిస్తే అత్యంత దారుణమైన మాటలు వస్తాయనేది తెలిసిన విషయమే. సృహలో ఉండి మాట్లాడతారా.. లేక, పెరిగిన పరిస్థితి, పెంపకం అలాంటిదా అనేది తెలియదు కానీ… తాజాగా మహిళామంత్రిపై నోరుపారేసుకున్నారు. గతంలో తమకు అంటుకున్న బురదను ఆమెపై వేసే పనికిపూనుకున్నారు. దీంతో భువనేశ్వరి, బ్రాహ్మణిలను రోడ్లపైకి లాగినంత పనిచేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి మరోసారి మైకులముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రోజా పై తీవ్రస్థాయిలో అవాకులూ చెవాకులూ పేలారు. దీంతో… పక్క పార్టీలో మ‌హిళ‌ల‌ను తిడితే.. త‌మ పార్టీకి చెందిన కుటుంబ స‌భ్యుల్ని కూడా అదే రేంజ్‌ లో బ‌జారుకు ఈడుస్తార‌నే ఇంగితం కోల్పోయినట్లున్నారానే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన ఆనం… “మేయ్… రోజా.. నిన్ను, మీ నాయకుడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. రాజమండ్రి జైళ్లో సంబరాలు చేసుకుందురు. సెక్స్ రాకెట్‌ తో నీకు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ.. ఉండి ఉండొచ్చు కూడా. చంద్రబాబుకి మాత్రం సంబంధం లేదు” అని నోరు పారేసుకున్నాడు.

దీంతో కామెంట్స్ యాజ్ టీజ్ గా ఉంచి… “రోజా” ప్లేస్ లో భువనేశ్వరి, బ్రాహ్మణిల పేర్లు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు. బురద జల్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోకపోతే ఇలాంటి రివర్స్ కౌంటర్స్ తప్పని చెబుతున్నారు. ఈయన నోటి దురతవల్ల చంద్రబాబు, లోకేష్ లు తమ భార్యలను రోడ్లపైకి లాగుతున్నారని చెబుతున్నారు.