పవన్ కళ్యాణ్ కు గుడ్ న్యూస్ చెప్పటానికి అమిత్ షా వస్తున్నారట !

Amit Shah will arrive in Tirupati on feb 29 to preside over the Southern States Council meeting

దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి అధ్యక్షత వహించడానికి కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 29న తిరుపతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు , పుదుచ్చేరి, ఆండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీప్ యొక్క గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో భేటి కానున్నారు. దక్షిణాదికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. భేటీ అనంతరం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి అమిత్ షా మరో రోజు తిరుపతిలో ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి. తిరుపతి పార్లమెంటరీ స్థానానికి రాబోయే ఉప ఎన్నికలపై అభ్యర్థిని ఇక్కడే తేలుస్తారని.. ఈ మేరకు బిజెపి నాయకులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తారని సమాచారం.

Amit Shah will arrive in Tirupati on feb 29 to preside over the Southern States Council meeting
Amit Shah will arrive in Tirupati on feb 29 to preside over the Southern States Council meeting

అయితే అభ్యర్థి బిజెపి నుంచి వస్తారా లేదా జనసేన నుంచి వస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.తిరుపతి ఉప ఎన్నికలలో పోటీచేయడానికి బీజేపీ నాయకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అమిత్ షాను కలవడానికి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి రావచ్చని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని వర్గాలు తెలిపాయి. “బిజెపి అభ్యర్థి అయినా జనసేన అభ్యర్థి అయినా అభ్యర్థి విజయం కోసం రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి” అని సోము వీర్రాజు ప్రకటించటం జరిగింది. జనసేన నుండే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ, జనసేన పార్టీ వర్గాల నుండి తెలుస్తుంది.