నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టిమిండియా

మొహాలి వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు మార్పులతో భారత్ జట్టు బరిలోకి దిగనుంది. కాగా, మూడో వన్డేలో విజయం సాధించిన ఆసీస్ జట్టు ఈ వన్డేనూ సొంతం చేసుకుని సిరీస్ ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసానికి టీమిండియా కన్నేసింది.