వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివేకా అనుచరుడు గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివేకా హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు అయినట్టు పోలీసులు గుర్తించారు.

బాత్రూంలో ఉన్న వివేకా డెడ్ బాడీని బెడ్ రూంకి తరలించారని, బెడ్రూంలో ఉన్న రక్తపు మరకలను చెరిపేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో గంగిరెడ్డి అక్కడే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.

వివేక రాసిన లేఖ ఉదయం దొరికినా సాయంత్రం దాకా ఇవ్వలేదని పీఏని అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి పులివెందుల కోర్టు ముందు పోలీసులు హాజరు పర్చారు.