సీఎం జగన్ చావు నాచేతుల్లోనే అంటున్న వైకాపా అభిమాని ?

ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో నానా రచ్చ జరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టింది తడవుగా మూడు రాజధానుల ప్రకటన తీసుకురావడంతో సర్వత్రా ఉత్కంఠకు దారి తీసింది. జగన్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పధకాలు ప్రవేశ పెడుతున్నా కూడా మూడు రాజధానుల కారణంగా అయన విపక్షాలకు టార్గెట్ అయ్యారు. టిడిపి తో పాటు పవన్ జనసేన పార్టీ కూడా మూడు రాజధానుల విషయంలో గట్టిగానే పోరాటం చేస్తుంది. రాజధానికోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరిగిందంటూ విపక్ష పార్టీలన్నీ పోరాటం చేస్తున్నాయి.

ఓ[[ఆటోలు అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే యాభై రోజులకు పైగా దీక్ష కూడా చేపడుతున్నారు. అమరావతికోసం భూములిచ్చిన రైతులను జగన్ మోసం చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో మొదలైన ఈ ఉద్యమం ఉదృతంగా మారి .. అటు జిల్లాలకు పాకింది. మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ మొండి వైఖరిని విడిచిపెట్టాలని, అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసిపి అభిమాని ఒకరు మాత్రం జగన్ పై దారుణమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. రైతులు చేపట్టిన దీక్షాలో ఉన్న ఓ వైకాపా అభిమాని ఒకరు మాట్లాడుతూ .. జగన్ ను నమ్మి ఎన్నికల్లో వైకాపా కు ఓటేసినందుకు రైతులను రోడ్డున పడేశారని, రాజధాని తరలింపుని విరమించుకోకపోతే .. తాను జగన్ ను హత్య చేసేందుకైనా వెనుకాడనని అన్నారు .. సడన్ గా అతడు అలా మాట్లాడడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు .. ఆ తరువాత తేరుకుని .. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా అనకూడదు అంటూ హితవు చెప్పి పక్కకు తీసుకెళ్లారు. మరి ఈ విషయంలో జగన్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.