సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న జగన్

సచివాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 8.39 గంటలకు బాధ్యతలు తీసుకున్నారు. మొన్న సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఇంటి నుండే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  వాస్తు ప్రకారం సచివాలయంలో మార్పులు పూర్తి కాకపోవటంతో తాడేపల్లిలోని ఇంట్లోనే సమీక్షలు, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించాల్సొచ్చింది.

సచివాలయంలో మార్పులు చేర్పులు పూర్తవ్వటంతో శనివారం సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. తన చాంబర్లోనే సమీక్షలు చేయటానికి, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించుకోవటానికి యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 8.39 గంటలకు శృంగేరీ పీఠం నుండి వచ్చిన వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు.  బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మూడు ఫైళ్ళపై సంతకాలు చేశారు.