విజయ సాయి రెడ్డి మాస్కుపై నాగబాబు ఆవేదన

మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై సరదా సెటైర్ల వేశారు.. చంద్రబాబుకి కరోనా ధర్మాన్ని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యంత్రులు మమత, కేసీఆర్‌ లకు మద్దతు తెలిపారు.

నటుడు, జనసేన నేత నాగబాబు.. కరోనాలో పాటించాల్సిన ధర్మం ఒకటుందని ట్విట్టర్ వేదికగా మస్త్ ట్వీట్స్ చేశారు. తెలంగాణ, ఏపీకి, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రతిపక్ష నేతలు చేస్తోంది ఇదీ అంటూ చూపించే ప్రయత్నం చేశారు.

ముందుగా ఓ కార్యక్రమానికి మాస్క్ ధరించి వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి నోటికి ధరించిన మాస్క్‌ తొలగించడంపై మెగా బ్రదర్ నాగబాబు మాంచి సెటైర్ వేశారు. “విజయ సాయి రెడ్డి మాస్క్ ముక్కు, నోటికి పెట్టుకోండి. గొంతుకి కాదు. ఒక వేళ మీరు అసిమ్టోమేటిక్ అయినా ప్రాబ్లెమ్ లేదు. మీ సెక్యురిటి కూడా మాస్కులు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త గా చూసుకోండి. ఫ్యూచర్‌లో ఫైట్ చేయాలిగా మీతో. మీకు మాస్క్ వున్నా జనం గుర్తు పడతారు. నేను గారంటీ” అంటూ ట్వీట్ చేశారు నాగబాబు.

అలాగే ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు కూడా మాస్క్ పెట్టుకోలేదని, ప్రధాని మోదీ మాస్క్ పెట్టుకున్న ఫొటోతో పాటు, కేసీఆర్, మమత మాస్కలు పెట్టుకున్న ఫొటోలను కూడా జతచేశారు. పబ్లిక్‌లో మాస్క్‌లు పెట్టుకోవడం మన ధర్మం అంటూ.. మాస్కులు ఉన్నా ఉపయోగం లేని నాయకులు అంటూ తేల్చేశారు. ఏదేమైనా నాగబాబు చెప్పింది కరెక్టే.. మాస్కులు కొనుక్కుని పెట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇలా నేతలు మాత్రం మాస్కులు కిందకి తీసేసి, లేదా అసలు లేకుండా మీడియా సమావేశాలు నిర్వహించడంపై బాగా స్పందించారు.