బాబు మనసుకు పెద్ద క్షోభ.. కారణం !

 
ప్రతిపక్ష నేతగా మారి బాధతో కుమిలిపోతున్న  చంద్రబాబును తన మాటల దాడితో  వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  ఇంకా అతి దారుణంగా అవమానిస్తూ బాబును మానసికంగా వేధిస్తోన్నాడనేది వాస్తవం.  తాజాగా సాయి రెడ్డి మరోసారి  ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ‘ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్  పర్వాలేదు, మరో అవమానకరమైన ట్వీట్ కూడా చేశాడు.    
 
‘కళ్లు మండుతున్నాయా అని అన్నది నిన్నే బాబూ.  పొరుగు రాష్ట్రంలో ప్రవాస జీవితం. ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ. పక్కింటి వాళ్లు కూడా గుర్తించని అజ్ఞాతవాసం ఎక్కడ. బయట అడుగుపెడితే క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాకెక్కుతున్నాయి. ఎంత కష్టం వచ్చిపడింది’ అంటూ  సాయి రెడ్డి బాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. బాబుకు మిగిలిన ఆ కాస్త ప్రశాంతతను కూడా లేకుండా చేస్తున్నాడు. 
 
అయితే విజయసాయి రెడ్డి మొన్న చేసిన ట్వీట్ మాత్రం బాబు అభిమానులను కూడా అతి దారుణంగా బాధ పెట్టింది. ఆ ట్వీట్ ఇదే.. ‘బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్‌ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా’ అంటూ చేసిన ట్వీట్‌.. ఆలాగే   ‘తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా?’ అంటూ చేసిన మరో ట్వీట్.. ఇలాంటి ట్వీట్స్ కచ్చితంగా  బాబు మనసును క్షోభ పెట్టి ఉంటాయి.