పాపం. టీడీపీని ఖాళీ చేసే ప్రయత్నాలు !

 
టీడీపీ పార్టీ దారుణమైన ఓటమి దెబ్బకి  ఆ పార్టీ విలువ అత్యంత దారుణంగా పడిపోయిందనేది తెలుగు తమ్ముళ్లు కూడా కాదనలేని నిజం. ఓడిపోయిన క్షణం నుండి బాబు టీడీపీ బలాన్ని బలగాన్ని  కాపాడుకునే  ప్రయత్నం చేస్తున్నా..  టీడీపీకి మరియు అందులోని నాయకులకు ఎదురు దెబ్బలు అవహేళనలు అవమానాలు విపరీతంగా తగులుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు పార్టీకి అండగా  బలమైన ఆర్ధిక శక్తులుగా ఉన్న  నాయకులు ఎప్పుడో  బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మరో ఇద్దరూ వైసీపీ క్రీడలో పావులుగా మారి  బాబు పైనే బుసలు  కొడుతున్నారు.
 
ఇక స్వతహాగా జన బలం ఉన్న నేతలు  టీడీపీకి అలాగే బాబుకి కూడా  ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. ఇక ఓడిపోయిన టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరిపోయారు. ఇంకా చేరే అవకాశం ఉంది.  అయితే ఈ వలసలను గత కొన్ని నెలలుగా బాబు సమర్ధవంతంగా ఆపగలిగారు. లేకపోతే కాపు నాయకులు కార్యకర్తలు ఎప్పుడో తమ జెండాని  ఎజెండాని మార్చుకునే వారు.  కానీ బాబు అడుగులను ఆలోచనలను గమనించిన ప్రత్యర్ధి పార్టీలు, కొత్త వ్యూహాలను అమలు పరుస్తోంది. దాంతో  బాబుకి మళ్ళీ చెడ్డ రోజులు వచ్చినట్లే భావించాలి.  ముఖ్యంగా టీడీపీ కాపు నాయకులు బీజేపీలోకి వెళ్ళటం ఖాయంగా కనిపిస్తోంది.
 
బీజేపీ ప్రధానంగా గోదావరి, విజయనగరం, వైజాగ్ లకు చెందిన పలువురు  కాపు నాయకులను  తమ వైపు తిప్పుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.  గత కొంత కాలంగా  టీడీపీ కాపు నాయకులు  చాలా సైలెంట్ గా ఉంటున్నారు. దీనికి కారణం  పార్టీ మారే యోచనలో వాళ్ళు ఉన్నట్లు అనుమానం కలుగుతుంది. మరోవైపు  వైసీపీ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేల పై గురి పెట్టింది.  మొత్తానికి టీడీపీని ఖాళీ చేసేదాకా వదిలేలా లేరు ఎవ్వరూ.