నా బొమ్మ పెట్టుకొని  నెగ్గినోళ్లు  రాజీనామా చేయాలి  ! 

ysrcp Leaders Fires On Raghu Rama Krishna Raju
 
వైసీపీ నేత అయి ఉండి  వైసీపీ నేతలను మరియు వైసీపీ అదినేతను,  రెబల్ స్టార్ రేంజ్ లో చెడుగుడు ఆడుకుంటున్నాడు  ఎంపీ రఘురామకృష్ణంరాజు.  గత కొంతకాలంగా వైసీపీ నేతలు, రఘురామకృష్ణంరాజుల మధ్య మాటలు తూటాలు పేలుతూనే  ఉన్నాయి. కాగా తన పై వైసీపీ నేతలు చేసిన విమర్శల పై  రఘురామకృష్ణంరాజు  చేతిలో కత్తి లేకుండానే విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలంతా పందులు అన్నట్లుగా ఆయన విమర్శకులు చేస్తూనే..  సింహం సింగిల్‌ గానే వస్తుందంటూ  రజనీకాంత్‌ డైలాగ్‌ ను  తానే పెద్ద  సూపర్ స్టార్ అన్నట్లు ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని మాస్ హీరోలా సవాల్‌ విసిరారు.
 
ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన మాటలు అన్నారు. ‘నన్ను విమర్శించిన వాళ్లు జగన్‌ బొమ్మ పెట్టుకొని గెలిచి చూపించాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో నాపై తిట్ల పర్వం కొనసాగించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక దొంగ‌. ఇళ్ల స్థలాల్లోనూ ఆయన రూ.కోట్లు దండుకున్నారు. సత్యనారాయణ అరాచకాల గురించి ఆయన మేనల్లుడే చెబుతారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ రావు కూడా సీఎం అపాయింట్‌ మెంట్‌ దొరక్క బాధపడ్డారు’’ అని వైసీపీ ఎమ్మెల్యేల బాగోతాల గురించి  చెప్పుకొచ్చారు.  

 

అలాగే  ఆయన ఇంకా మాట్లాడుతూ..  సీఎం జగన్‌ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే చెప్పాను. ఆయన ఇంటికి వెళ్లడానికి నేను ఇష్టపడకపోతే ఎయిర్‌ పోర్టులో కలిశారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా గల వ్యక్తి. పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నా బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గిన  ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి’’ అని రఘు రామకృష్ణరాజు మొత్తానికే  తానే కింగ్ మేకర్ నని చెబుతున్నాడు.