నారా లోకేష్ కు భద్రత కుదింపు ?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి .. నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం తగ్గించింది. గతంలో జడ్ ప్లస్ కేటగిరి నుంచి అయన భద్రతను కుదించారు. ఎనిమిది నెలల్లో రెండు సార్లు భద్రతా కుదించారని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ భద్రత కుదించి వైకాపా ప్రభుత్వం శాడిజం చూపిస్తుందని అన్నారు. మాజీ ముఖ్యంమత్రి కుమారుడిగా, ఎం ఎల్ సి గా ఉన్న లోకేష్ కు గత ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీని నియమించింది. ప్రస్తుతం ఆయనకు భద్రతను తగ్గిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం పై టిడిపి వర్గాల్లో ఆందోళన కనిపిస్తుంది. కావాలని టిడిపి నాయకులపై కక్ష్య సాధింపు పనులు చేస్తున్నారంటూ జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం లోకేష్ మాములు భద్రతతోనే ఉండనున్నారు.