టిడిపి నేత పరిస్ధితి విషమం

తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత శివప్రసాద్ పరిస్ధితి చాలా విషమంగా ఉంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతికి చెందిన శివప్రసాద్ చిత్తూరు నుండి రెండుసార్లు ఎంపిగా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.  ఒకసారి ఎంఎల్ఏగా కూడా గెలిచిన శివప్రసాద్ సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో చిత్తూరు ఎంపిగా పోటి చేసి ఓడిపోయారు.

శివప్రసాద్ చాలా రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పాడైపోయాయినట్లు సమాచారం. చాలా కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ప్రయత్నించినా వైద్యులు లాభం లేదని చెప్పినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

పరిస్దితి సీరియస్ గా మారటంతో శివప్రసాద్ ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. చికిత్సకు కూడా శివప్రసాద్ శరీరం పెద్దగా సహకరించటం లేదట. దాంతో ఏమి చేయాలో డాక్టర్లకు కూడా పాలుపోవటం లేదని సమాచారం. మాజీ ఎంపి భార్య కూడా డాక్టరే.