ఎన్టీఆర్ పై ప్రేమ తక్కువ జగన్ పై కోపం ఎక్కువ !

 
మ‌హానాడులో  టీడీపీ నాయకులు  ఎన్టీఆర్ ను ఎంత భక్తిశ్రద్ధలతో కీర్తిస్తున్నారో  తెలియదు గాని, జగన్ పై మాత్రం తమ ఆక్రోశాన్ని తమ ఉక్రోశాన్ని  పూర్తి స్థాయిలో వెళ్లగక్కుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే..  ఎన్టీఆర్ పై ప్రేమ తక్కువ  జగన్ పై కోపం ఎక్కువగా ఉన్నట్టు ఉంది.  ఆర్ధిక నేరాలు చేసిన జగన్  రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌ని,  జైలుకు వెళ్ళొచ్చిన‌ జగన్  న్యాయ వ్యవస్థను విమర్శిస్తున్నారని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై  అయ్య‌న్న పాత్రుడు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.   అక్రమ కేసుల పై మ‌హానాడులో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ అయ్యన్న పాత్రుడు, వైసీపీ నేత‌లు దోచుకోవ‌డానికే అధికారంలోకి వచ్చారని   అయ్య‌న్నగారు ద్వ‌జ‌మెత్తారు.  

అలాగే వైసీపీ స‌ర్కార్‌ ను ప్రశ్నించిన వారి పై అక్రమ కేసులు పెడుతున్నారని  కూడా అయ్య‌న్నగారు ఆరోపించారు. అదే నిజమైతే ఈ రేంజ్ లో తిట్టిన  అయ్య‌న్న పాత్రుడు పై ఇంకెన్ని కేసులు పెట్ట్టాలి ? అన్నట్టు  విజయసాయిరెడ్డితో స‌హా చాలామంది వైసీపీ బ్యాచ్, రాష్ట్రంలో విచ్చలవిడిగా భూములు కాజేస్తున్నారని  అయ్య‌న్నగారు తెగ ఇదైపోతున్నారు. ఈయనగారా భూములు గురించి మాట్లాడేది ? అధికారంలో ఉన్నప్పుడు రాజధానికి దగ్గరలోని పొన్నూరు రోడ్ వైపు ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వం భూమి ఏమైనట్టు ? టీడీపీ దిక్కులేని స్థితిలోకి వెళ్లిపోవటానికి కారణం ఇలాంటి నాయకులే. 

 
అయినా తప్పుల మీద త‌ప్పులు చేయడానికి పాలన చేస్తుంది బాబు కాదు కదా,  అధికార ప్రభుత్వానికి డీజీపీ వంత‌పాడుతున్నాడట.  దోపిడీ దారులకు పోలీసులు అండగా నిలిచింది టీడీపీ హయాంలో కాదా ? రౌడీలు రాజ్య‌మేలుతున్నార‌ని అయ్య‌న్న పాత్రుడు అన్నారు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా రౌడీల్లా ఎగబడి కొట్టింది టీడీపీ ప్రభుత్వంలో కాదా ?  ఇన్ని చేసి కూడా తెలుగుదేశం పార్టీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు అంటున్నాడంటే బాబుకు వయసుతో పాటు  బుర్రలో గుజ్జు కూడా అయిపోయిందని అర్ధం చేసుకోవాలేమో. అయినా తెలుగుదేశం పార్టీ  ఎపుడో  బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక ఆగమాగమయింది.