అరె.. జగన్ కి  రిలీఫ్ లోకేషేనట !

 
ముఖ్యమంత్రి అయినా  కాస్త రిలీఫ్ ఉండాలి కదా, కాగా జగన్ కి రిలీఫ్ మాత్రం లోకేషేనట. ప్చ్..  మన లోకేశం జగన్ మీద  వైసీపీ పార్టీ నేతల మీద  సోషల్ మీడియాలో  మాటల యుద్ధం చేయాలనీ తెగ కింద మీదా పడుతున్నా.. వాళ్ళు మాత్రం లోకేష్ ను కమెడియన్ గానే చూస్తున్నారు.    అందుకేనేమో  ఆ బాధలో ఏమి ట్వీట్ చేస్తున్నాడో.. ఎందుకు చేస్తున్నాడో కూడా  తెలియకుండానే తెగ ట్వీట్స్ చేసి పారేస్తున్నాడు మన లోకేశం.  తాజాగా మన లోకేశం బాబు ట్వీట్ చేస్తూ.. ‘రౌడీ రాజ్యంలో రక్షణ కొరవైంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఫ్యాక్షన్ పోకడలను  జగన్ గారు వదులుకోవడం లేదు. శాంతి, భద్రతలను కాపాడాల్సిన వారే విఘాతం కలిగిస్తున్నారు’ అని పోస్ట్ చేశారు. అయినా  శాంతి, భద్రతలను కాపాడాల్సిన వారే  విఘాతం ఎందుకు కలిగిస్తారో ? కలిగిస్తే వారికే కదా బ్యాడ్ నేమ్ ? ఇవ్వన్నీ లోకేశం ఆలోచించి ఉండదు.     
 
అలాగే మరో ట్వీట్ చేస్తూ.. ‘వాలంటీర్ల పేరుతో 25వేల కోట్ల ప్రజా ధనం వైకాపా కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. పైగా పెన్షన్ దగ్గర నుండి ఇళ్ల పట్టాల దాక వసూళ్ల దందా.  వాలంటీర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది’  అని విమర్శలు చెయ్యటానికి నానాపాట్లు పడ్డాడు లోకేష్. కాకపోతే వాలంటీర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఏమిటో ? వాలంటీర్లకు ఉన్న పరిధి ఏమిటి ? వాళ్లకున్న అధికారం ఎంత ? ఈ లోకేశంకు  కనీస లోకజ్ఞానం కూడా లేదు అనుకుంటా పాపం.      
 
ఏమైనా మన పప్పుగోరికి కూడా  కోపం వస్తోందని  ఇలా ట్విట్టర్ లో నిరూపిస్తున్నాడండోయ్. ఇక లోకేశం ట్వీట్స్  చూసి వైసీపీ నాయకులూ తెగ నవ్వుకుంటున్నారట.  అయితే  జగన్ కూడా కాసేపు నవ్వుకోవడానికి బ్రహ్మానందం కామెడీ చూడటం మానేసి.. ఈ మధ్య మన పప్పుగోరి వీడియోలు మరియు ట్వీట్లునే చూస్తున్నారట. మొత్తానికి మన పప్పుగోరూ జగన్ ను కూడా బాగా నవ్విస్తున్నాడు.  ఎందుకు పనికి రాడని మొన్నటివరకూ పచ్చ తమ్ముళ్లు కూడా తెగ ఫీల్ అయ్యారు. ఇక నుంచి వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదు. రాజకీయ కామెడీని పండించడంలో ద గ్రేట్ పాల్ ను కూడా  సింపుల్ గా బీట్ చేస్తున్నాడు మన లోకేశం బాబు.