అమరావతి నుండి రాజధాని తరలించ కూడదని మూడు రాజధానుల ప్రతి పాదన విరమించుకోవాలని పవన్ కల్యాణ్ ఈ నాటికి పోరాడుతున్నారు. రేపు 15 వ తేదీ రాజధాని గ్రామాల్లో పర్యటన పెట్టుకొని వున్నారు. కర్నూలులో హైకోర్టు ఏవిధంగా పెడతారని కూడా ప్రశ్నించిన సందర్భాలున్నాయి. ఈ దశలో కర్నూలులో చంద్రబాబు నాయుడు తో పాటు పవన్ కళ్యాణ్ శవ యాత్రలు జరిగాయి. సీమ ఉద్యమ కారులు నిరసన ప్రదర్శనలు చేశారు. పవన్ కళ్యాణ్ ను రాయలసీమ ద్రోహిగా సీమ ఉద్యమ కారులు ముద్ర వేశారు ఒకప్పుడు రాయలసీమ పరిరక్షణ కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ కోస్తా వాళ్ళ ఏజంట్ గా మారి పోయారని సీమ జిల్లాల్లో అడుగు పెట్ట నివ్వమని ఉద్యమ కారులు ప్రకటనలు చేసిన సందర్భముంది.
ఇటీవల వరకు సీమ పర్యటన గురించి పట్టించుకోని పవన్ కళ్యాణ్ హఠాత్తుగా కర్నూలు జిల్లా జన సేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు నెలకొల్పే అంశం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి సమావేశం తర్వాత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు నెలకొల్పుటకు జనసేన అనుకూలమని ప్రకటన చేశారు.అయినా తన పర్యటనలో నిరసనలు వ్యక్తం అవుతాయని భావించి కాబోలు. తెలుగు దేశం హయాంలో హత్యాచారానికి గురైన గిరిజన యువతి ప్రీతికి న్యాయం కోసం తను ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హైకోర్టుకు అనుకూలంగా ప్రకటన చేసినా సుగాలి యువతి ప్రీతి అంశం ముందుకు తెచ్చినా సీమ ఉద్యమ కారులు సంత్రుప్తి పడ లేదు
కొందరు పవన్ కళ్యాణ్ వస్తే అడ్డగిస్తామని ప్రకటనలు చేశారు. అందుకు ప్రతిగా గిరిజన సంఘాల నేతలు పలువురు పవన్ కళ్యాణ్ పర్యటనకు అండగా వుంటామని ప్రకటనలు చేశారు.ఇరువురు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది.
ఈ పూర్వ రంగంలో పవన్ కళ్యాణ్ పర్యటన కర్నూలు జిల్లాలో బుధ గురు వారాల్లో జరగ నుంది. కర్నూలులోనే కాకుండా ఎమ్మిగనూరులో కూడా పర్యటన పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సీమ ఉద్యమకారుల స్పందన ఏలా వుంటుందో చూడాలి. సీమ ఉద్యమకారులురు నిరసన ప్రదర్శనలు నిర్వహించితే అటు పోలీసులు ఇటు జనసైనికులు స్పందన తీవ్రంగా వుండే పరిస్థితి వుంది.
అయినా ఎప్పుడో 2017 జరిగిన ప్రీతీ హత్య మీద ఇప్పుడే నిద్రలేచినట్టు పవన్ కళ్యాణ్ స్పందించడం కొందరికి ఆశ్చర్యం కలగచేస్తుండగా, కొందరేమో ఇది పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఒక వ్యూహాత్మకమైన పర్యటనగా చూస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులూ ఎప్పుడు కోరుకునేది వార్తల్లో నిలవాలని. ఈ పర్యటనతో ఆ లక్ష్యం పవన్ కళ్యాణ్ కి సిద్ధిస్తుంది.
