రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు ఇంద్రనీల్..?

మొగలిరేకులు సీరియల్ లో దయ పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరైన బుల్లితెర నటుడు ఇంద్రనీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సీరియల్స్ లోటించి నటుడిగా గుర్తింపు పొందిన ఇంద్రనీల్ కొంతకాలం సీరియల్స్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవల కొంతకాలంగా మాటీవీలో న ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రెండవ పెళ్లి గురించి ఇంద్రనీల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ మాట్లాడుతూ రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు .

ఈ ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ మాట్లాడుతూ…” ప్రస్తుతం మనం 2022 జనరేషన్ లో ఉన్నాం. ఈ సమాజంలో రెండో వివాహాన్ని చేసుకునే వారిని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే.. మనం ఒక మనిషిని నమ్మి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత..ఆ వ్యక్తితో మనం కలసి బ్రతకలేమని తెలిసిన తర్వాత కూడా వారితో కలిసి ఉంటూ బాధపడడం కన్నా విడిపోవటమే మంచిది. ఆ తర్వాత మన మనసుకు నచ్చిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటంలో ఎటువంటి తప్పులేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మొదటి పెళ్లి నచ్చక విడిపోయిన తర్వాత చట్టబద్ధంగా రెండో పెళ్లి చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. రెండో పెళ్ళి అంటేనే అదేదో పాపం అన్నట్లు అందరు దాన్ని నెగిటివ్గా ఎందుకు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక తోడు కావాలి. మనకి నచ్చిన వ్యక్తి ఆ తోడుగా వస్తే మన లైఫ్ ఇంకా బాగుంటుంది . తనకు నచ్చిన విధంగా జీవించటం మనిషి హక్కు. మొదటి వ్యక్తి నచ్చకపోతే తమకు నచ్చిన వ్యక్తి ని రెండవ పెళ్ళి చేసుకొని వారితో కలిసి ఉండడం తప్పేం కాదు ..ఎవరి ఇష్టం వారిది “అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇండ్రనీల్ రెండవ పెళ్ళి గురించి ఇలా మాట్లాడంతో అతను కూడా తన భార్య కి విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ చేస్తున్నారు.