AP: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతి పనులపై వైసిపి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబంటి రాంబాబు ఈ పునర్నిర్మాణం గురించి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక అంతులేని కథ అమరావతిని నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారంటూ అంబటి రాంబాబు తెలిపారు.
అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో 41 వేల కోట్లకు పైగా టెండర్లు పిలిచి 5500 కోట్లు ఖర్చు చేశారు.. గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అమరావతి కాస్త భ్రమరావతిగా మారిపోయిందని అందుకే గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలందరూ చిత్తుచిత్తుగా ఓడించారని అంబటి రాంబాబు తెలిపారు.
అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అందరిని నిలువునా ముంచారని రాంబాబు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయారనీ తెలిపారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. మేము అన్ని వాస్తవాలు చెబుతున్నాం.. జగన్ అమరావతిని అభివృద్ధి చేద్దామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు.. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని తెలిపారు.
ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అంటూ చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం గురించి అంబంటి రాంబాబు చేసిని వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.