శ్రీముఖి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సింగర్ తండ్రీ.. కానీ ఆ విషయంలో మెలిక పెట్టాడుగా..?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన శ్రీముఖి తన గ్లామర్ తో పాటు యాంకరింగ్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో బుల్లితెర మీద ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు పొందింది. శ్రీముఖి ఇలా యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. జులాయి సినిమా ద్వారా నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన శ్రీముఖి ఎన్నో సినిమాలలో నటించింది. అయితే ఎక్కువ గ్లామర్ పాత్రలు రావటంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం శ్రీముఖి మళ్ళీ సినిమాలలో నటించటం ప్రారంభించింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర మీద ప్రసారమవుతున్న జాతి రత్నాలు, సరిగమప వంటి షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. మాటీవీలో ప్రసారమవుతున్న సరిగమప సింగింగ్ షో లో శ్రీముఖి ఫుల్ హంగామా చేస్తోంది. సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొనే సాయి శ్రీ చరణ్ తో లవ్ ట్రాక్ నడుపుతోంది. ప్రస్తుతం ప్రతి టీవి షో ఇలాంటి ట్రాక్ లు కచ్చితంగా ఉంటున్నాయి. అయితే ఈ సరిగమప షో లో మాత్రం శ్రీముఖి ,సాయి శ్రీ చరణ్ మద్య లవ్ ట్రాక్ క్రియేట్ చేశారు. ఇదంతా కేవలం టీఆర్పీ కోసమని ప్రేక్షకులకు కూడా తెలుసు. అయినప్పటికీ ఈ జంటను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

అయితే చాలా కాలంగా సాయి శ్రీ చరణ్ ని ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్న శ్రీముఖి కి అతని తండ్రి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఈ ప్రోమోలో సాయి శ్రీ చరణ్ ‘ నువ్వు నాకు నచ్చావ్ ‘ సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ని అద్భుతంగా పాడాడు. ఆ తర్వత శ్రీముఖి కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆ పాటని పాడుతూ తన ప్రేమను తెలిపింది. ఆ తర్వాత సాయి శ్రీ చరణ్ తండ్రిని మామ అంటూ స్టేజ్ మీదకు పిలిచింది. మా ఆవిడ రాలేకపోయింది అనగానే శ్రీముఖి అత్తమ్మ నా? అని అంటుంది. దానికి చరణ్ తండ్రి స్పందిస్తూ ‘అత్తమ్మో గిత్తమో’ అంటూ ఫన్నీగా సెటైర్ వేసాడు. ఆ తర్వాత అతను మాట్లాడుతూ మా ఆవిడ నిన్ను మూడు ప్రశ్నలు అడగమంది. నువ్వు కరెక్టుగా ఆన్సర్ ఇస్తే నాకేమీ అభ్యంతరం లేదు అంది’ అని చెప్పారు. దీంతో ‘నీకు ముగ్గు వేయడం వచ్చా’ అని మొదటి ప్రశ్న వేసాడు. దీనికి శ్రీముఖి ‘ముగ్గులో దించడం వచ్చు మామయ్య’ అని ఫన్నీగా సమాధానం చెప్పింది.