తన భర్త చనిపోయినప్పుడు డ్రైవర్ మాత్రమే తోడున్నాడంటూ ఎమోషనల్ అయినా సురేఖ వాణి?

సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే తన భర్త మరణించిన తర్వాత సురేఖ వాణి తన కూతురితో పాటు ఉంటూ నిత్యం తన కూతురుతో కలిసి సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన భర్త గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన భర్తకు ముందు నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయని అయితే అది ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వడం వల్ల పెద్దగా భయపడలేదని తెలిపారు. ఇకపోతే తన భర్త చనిపోవడానికి పది సంవత్సరాలు ముందు నుంచి ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు షుగర్ ఎక్కువ అవ్వటం వల్ల అతనికి శరీరంలో బ్లడ్ ఎక్కడపడితే అక్కడ క్లాట్ అయ్యేది.ఇలా ఒకసారి ఖాళీ వేళల్లో బ్లడ్ క్లాట్ అవడంతో ఆయన కాలు వేలు తొలగించారని ఇలా తొలగించిన నెల రోజులలోపే తన భర్త చనిపోయాడని సురేఖ వాణి గుర్తు చేసుకున్నారు.

ఆయన చనిపోయే రోజు ఉదయం కూడా ఎంతో బాగున్నారు అతను బాగున్నారని మేము మార్కెట్ వెళ్ళాం.అయితే మార్కెట్ కి వెళ్ళగానే అతను పరిస్థితి చాలా క్షీణించింది. ఈ విషయం వెంటనే డ్రైవర్ ఫోన్ చేసి చెప్పగా నేను తనని హాస్పిటల్ తీసుకు రమ్మని చెప్పి అటునుంచి హాస్పిటల్ కి వెళ్ళానని సురేఖ వాణి తెలిపారు.అయితే అప్పటికే జరగాల్సినది మొత్తం జరిగిపోయిందని ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇక తన భర్త చనిపోయిన సమయంలో తన పక్కన డ్రైవర్ తప్ప ఎవరు సహాయంగా లేరని ఆ క్షణాలను తలచుకొని కుమిలిపోయారు.