మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీముఖి

తెలుగు బుల్లితెర పై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాల ద్వారా శ్రీముఖి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఈమె ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరికొంత కార్యక్రమం ద్వారా శ్రీముఖి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.తెలుగు బుల్లితెరపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ త్వరలోనే మరొక కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈటీవీలో ప్రతి మంగళవారం మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అక్టోబర్ 11వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక ఈ కార్యక్రమాల ద్వారా పదిమంది బుల్లితెర జంటలను ఆహ్వానించి వారికి పెద్ద ఎత్తున టాస్కులను నిర్వహించనున్నారు.

ఈ టాస్క్ లలో గెలిచినవారు గ్రాండ్ ఫినాలే వరకు వెళ్లడం గ్రాండ్ ఫినాల్లో గెలిచిన వారికి భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్ గా రాగా నటుడు శివ బాలాజీ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మొదటిసారి ఈ కార్యక్రమానికి నటి స్నేహ జడ్జిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా అక్టోబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.