జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పనున్న సౌమ్య రావు…. అనసూయ చెప్పింది నిజమైందిగా!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమం గురించి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్లపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లతో సెటైర్లు వేయడం డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడటం, అలాగే బాడీ షేమింగ్స్ ఎక్కువ అయ్యాయని వార్తలు వినపడుతున్నాయి. అయితే అనసూయ కూడా ఇలాంటి కామెంట్స్ తాను భరించలేకే బయటకు వచ్చానని చెప్పారు.

ఇక అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈమె స్థానంలోకి యాంకర్ సౌమ్య రావు వచ్చారు. అయితే ఈమె కూడా మొదటి రెండు మూడు వారాలు మంచిగా యాంకరింగ్ చేసినప్పటికీ ఈమె పై జబర్దస్త్ కమెడియన్స్ యధావిధిగా నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయి తనని కూడా బాడీ షేమింగ్ చేశారు.ఇలా జబర్దస్త్ కమెడియన్ల నుంచి సౌమ్యరావు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఈమె కూడా తాను మల్లెమాలవారికి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సౌమ్య రావు జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు రావడంతో గతంలో అనసూయ చెప్పినది పూర్తిగా నిజమేననీ, జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్లు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనీ తెలుస్తుంది. అయితే సౌమ్య రావు నిజంగానే తన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.