యాంకర్ రష్మి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ గీతామాధురి.. అసలేమైందంటే?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన రష్మీ.. ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని.. యాంకర్ గా తన మాటలతో, అందాలతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రష్మి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోయిన్ గా నటించినప్పటికీ సినిమాల ద్వారా ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు.అందువల్ల కొంత కాలం సినిమాలకు దూరమైంది.

కానీ సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు రావటంతో రష్మి ఇటీవల మళ్ళీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సింగర్ గీత మాధురి భర్త నందు హీరోగా నటించిన “బొమ్మ బ్లాక్ బాస్టర్” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని నందు రష్మీకి 32 సార్లు ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ తీయడం లేదని రచ్చ చేశాడు.

ఫోటో షూట్ చేసుకున్న రష్మి ఉన్న స్టూడియో కి వెళ్లి ఎందుకు ఫోన్ తీయటం లేదంటూ నిలదీశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గీతామాధురి కూడా ఈ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…తన భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రష్మి ఫోన్ తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ వీడియో కూడా కేవలం ప్రమోషన్స్ కోసం మాత్రమే షేర్ చేసినట్టు బయటపడింది.