పంచ్ ప్రసాద్ ప్రాణాలు కాపాడుకోవటానికి ఆమె జీవితాన్ని ఖర్చు చేసింది: హైపర్ ఆది

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన అది ఎప్పుడు అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉంటాడు. అయితే కొన్ని సందర్భాలలో అది కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా ఆది ఎమోషనల్ అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎప్పుడు అందరినీ నవ్వించడమే కాకుండా కొన్ని సందర్భాలలో కొందరి వ్యక్తిగత జీవితాల గురించి.. వారి జీవితంలో పడ్డ కష్టాల గురించి కూడా స్కిట్లు చేస్తూ అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు.

ఈ క్రమంలో గడిచిన వారం పొట్టి నరేష్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి స్కిట్ చేసి అందరి చేత కన్నీళ్ళు పెట్టించారు. ఇక ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో జబర్దస్త్ కమెడియన్ మంచి ప్రసాద్ రియల్ లైఫ్ గురించి స్కిట్ చేశారు. పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు పాడైపోయి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా తన భార్య అతనిని విడవకుండా వెన్నంటే ఉంటూ తన భర్తను కాపాడుకోవడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది.

పంచ్ ప్రసాద్ జీవితంలో అనుభవించిన కష్టాల గురించి చేసిన స్కిట్ చూసి అక్కడున్న వారందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రసాద్ పడిన బాధ గురించి చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆది మాట్లాడుతూ..” ఎవరైనా ప్రేమించిన వారి కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ పంచ్ ప్రసాద్ భార్య మాత్రం తనని కాపాడుకోవడానికి ఆమె జీవితాన్నే ఖర్చు చేసింది. ఇంతకన్నా ఆమె గురించి గొప్పగా చెప్పటానికి ఏముంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.