భర్తకు ఖరీదైన బహుమతి ఇచ్చిన సీరియల్ నటి హారిక..?

నేను శైలజ అనే సీరియల్ ద్వారా నటీనటులుగా గుర్తింపు పొందిన హారిక, ఏక్ నాథ్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్లో భార్యాభర్తలు గా నటించిన వీరిద్దరూ సీరియల్ షూటింగ్ సమయంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఇలా చాలాకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ 2020 వ సంవత్సరంలో తిరుపతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా వీరిద్దరూ విడివిడిగా సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న రియాలిటీ షోలో కూడా జంటగా పాల్గొని సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల హారిక తన భర్త ఏక్ నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా క్యూట్ ఫైర్ గా గుర్తింపు పొందింది. ఇక నవంబర్ 8వ తేదీ ఏక్ నాథ్ పుట్టినరోజు సందర్భంగా అరకులో తన భర్త పుట్టినరోజు పార్టీని చాలా ఘనంగా నిర్వహించింది. అరకు లోని ఒక రిసార్ట్ లో అర్ధరాత్రి సమయంలో ఏక్ నాథ్ తో కేక్ కట్ చేయించి అతనికి కొత్త బట్టలతోపాటు ఖరీదైన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. భార్య ఇచ్చిన ఆ బహుమతి చూసి ఏకనాథ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

తన భర్త పుట్టినరోజు సందర్భంగా హారిక ఖరీదైన ఐఫోన్ 14 ప్రోమాక్స్ ని బహుమతిగా ఇచ్చింది. ఈ ఐఫోన్ విలువ దాదాపు లక్షన్నర రూపాయలు. పుట్టినరోజు నాడు తన భార్య ప్రేమతో ఇచ్చిన ఈ కానుక తనకు ఎంతో నచ్చిందని ఏకనాథ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏక్ నాథ్ కేరాఫ్ అనసూయ అనే సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా వీరిద్దరూ సీరియల్స్ లో నటిస్తూ టీవీ షోలో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు.