Prabhas: ఆది పురుష్ టీమ్ కి ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రభాస్.. ఏంటంటే?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ తన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందానికి ఎంతో ఖరీదైన బహుమతులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే ప్రభాస్ బహుమతులు ఇచ్చిన విషయాన్ని చిత్ర బృందంలోని ఒక సభ్యుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రభాస్ చిత్ర బృందానికి ఖరీదైన రాడో రిస్ట్ వాచెస్ ప్రెజెంట్ చేశారని చిత్ర బృందం సభ్యుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు.గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ ఓ అభిమాని తన పేరు వచ్చేలా హెయిర్ కటింగ్ చేయించుకోవడంతో అతని అభిమానానికి ఫిదా అయిన బాహుబలి తనకు కూడా ఒక వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అలాగే తన జిమ్ ట్రైనర్ కు 73 లక్షల ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారణం బహుమతిగా ఇవ్వగా, ప్రస్తుతం ఆది పురుష చిత్ర బృందానికి ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.