దీపాల కాంతుల మధ్య వెలిగిపోతున్న రష్మి… వైరల్ అవుతున్న ఫోటోలు…!

దేశవ్యాప్తంగా అక్టోబర్ 24వ తేదీన ప్రజలందరూ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అలాగే జబర్దస్త్ గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్ కూడా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంది. పండగ సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించి తాను కూడా అందంగా సంప్రదాయ బద్ధంగా ముస్తాబై అమ్మవారిని పూజించింది. దీపావళి పండుగ రోజున రష్మి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలన్నింటిలోనూ రష్మి ఒంటరిగా కనిపిస్తోంది . అందువల్ల దీపావళి పండుగ రోజున రష్మీ ఒంటరిగా పండుగ జరుపుకున్నట్లు అర్థమవుతోంది.

దీపాల వెలుగుల మధ్య రష్మీ అందమైన మొహం కూడా వెలిగిపోతూ కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ పండగ రోజున రష్మి తన పెట్ డాగ్ ని హత్తుకొని ముద్దులు పెట్టిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరొక జన్మంటూ ఉంటే మీ ఇంట్లో కుక్కగా పుడతాను.. అని కొందరు కామెంట్ చేస్తుంటే, ముద్దులు అన్ని కుక్కకేనా? మాకు ఏమైనా ఉన్నాయా? అంటూ మరికొందరు రొమాంటిక్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ దీపావళి పండుగను రష్మీ ఎంతో ఆనందంగా జరుపుకున్నట్లు అర్థమవుతోంది.

ఇక రష్మి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మీ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. అనసూయ జబర్దస్త్ కి దూరం కావటంతో ఆమె స్థానంలో కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇలా వరుస టీవీ షో లతోపాటు ఇలా పండుగల సందర్భంగా ఈటీవీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా రష్మి సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల సింగర్ గీతామాధురి భర్త నందుతో కలిసి “బొమ్మ బ్లాక్ బస్టర్” అనే సినిమాలో నటించింది తొందరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.