చీర అందాలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తున్న రష్మి… వైరల్ అవుతున్న ఫోటోలు…!

బుల్లితెర గ్లామర్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలలో నటించిన రష్మి జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. జబర్దస్త్ లో రష్మీ తన మాట తీరుతో మాత్రమే కాకుండా తన అందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎప్పుడు మోడరన్ దుస్తులు ధరిస్తూ తన అందాలతో అందరిని ఆకట్టుకునే రష్మి ఇటీవల చీరలో మెరిసింది. వినాయక చవితి సందర్భంగా మల్లెమాల వారు నిర్వహించిన మా ఊరి దేవుడు అనే ఈవెంట్లో రష్మి చేసిన సందడి అంతా కాదు.

ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు షోల లోను యాంకర్ గా కొనసాగుతూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఇలా టీవీ షోస్ కోసం చేసిన ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఒక టీవీ షో కోసం అందంగా చీర కట్టుకొని ముస్తాబైన రష్మి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో రష్మి చీరకట్టలో చాలా అందంగా కనిపిస్తూ తన చూపులతో అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ ఫోటోలలో రష్మి తన బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో రష్మీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ క్రమంలో రష్మి ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బుధవారం వినాయక చవితి సందర్భంగా ఒక ఏనుగు ద్వారా వినాయకుడికి పూల మాల వేయిస్తున్న ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ సూపర్‌ అంటూ షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రష్మీ కూడా తాజాగా ఈ వీడియో పై స్పందించింది. వీడియో చూసి ఎంతో ఆనంద పడుతున్నారు కానీ ఆ సమయంలో ఆ ఏనుగు ఎంత బాధ అనుభవించిందో ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. మూగజీవాల పట్ల ఎప్పుడు ప్రేమని చూపించే రష్మి పాల ఉత్పత్తులు గాని లెదర్ వస్తువులు కానీ ఉపయోగించనని ఈ సందర్భంగా తెలియజేసింది.పాలు,పాల ఉత్పత్తుల కోసం ఒక ఆవు పదేపదే గర్భవతిగా మారడం తనకు బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. కేవలం మూడు రోజుల పీరియడ్స్ నొప్పిని అనుభవిస్తున్న నాకు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుందని ఈ సందర్భంగా వెల్లడించింది.