ఢీ షో కొత్త సీజన్ కోసం సుధీర్, రష్మితో చర్చలు జరిపిన మల్లెమాల… ఆ చర్చలు ఫలించేనా?

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో దేశంలోనే నెంబర్ వన్ డాన్స్ షోగా గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ డాన్స్ షో ప్రస్తుతం 14వ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో డాన్సర్లు తమ అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కాకుండా.. హైపర్ ఆది చేసే కామెడీ ఈ షో కి ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. మరి కొన్ని రోజులలో ఈ 14 సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. అందువల్ల ఢీ 15వ సీజన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ 15వ సీజన్ కి టీం లీడర్లుగా సుధీర్ రష్మితో మల్లెమాలవారు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో దాదాపు మూడు నాలుగు సీజన్లకు టీం లీడర్లుగా వ్యవహరించిన సుధీర్ రష్మీ ఆ సీజన్లు మంచి హిట్ అవడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల మొదట సుధీర్ ఢీ షోకి దూరం అయ్యాడు. ఆ తర్వాత రష్మీ కూడా ఆ షో కి దూరం అయింది. ఇలా సుధీర్ రష్మీ ఇద్దరు ఢీ షో కి దూరం కావటంతో ప్రస్తుతం హైపర్ ఆది టీం లీడర్ గా వ్యవహరిస్తూ షో హిట్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ఢీ సీజన్ 14 ముగింపు దశకు చేరుకుంది. ఈ 14వ సీజన్ తర్వాత 15వ సీజన్ లో టీం లీడర్లుగా సుధీర్ రష్మీ ని ఒప్పించే పనిలో మల్లెమాల వారు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

చాలా కాలంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు దూరమైన సుధీర్.. సరైన అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. అందువల్ల తిరిగి మల్లెమాల లో అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లో సుధీర్ కి ఛాన్స్ లేదు. కానీ ఢీ డాన్స్ షో లో మాత్రం ఛాన్స్ ఉంది అన్నట్లుగా మల్లెమాల వారు సుధీర్ కి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రష్మి ని కూడా ఈ ఢీ లో పెట్టాలని మల్లెమాల వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రష్మి కూడా ఇందుకు అంగీకరించటం తో 15 వ సీజన్ లో వీరిద్దరూ సందడి చేయడం ఖాయం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు.