మరొకసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన లాస్య..? వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఫిమేల్ యాంకర్లుగా గుర్తింపు పొందారు. అలా గుర్తింపు పొందిన వారిలో లాస్య కూడా ఒకరు. మొదట యాంకర్ రవితో కలిసి మ్యూజిక్ ఛానల్ కి యాంకర్ గా వ్యవహరించిన లాస్య ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంది. అలగే ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో కి కూడా రవితో కలిసి మెంటర్ గా వ్యవహరించి గుర్తింపు పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది.

వివాహం తర్వాత టీవీ షోలకు పూర్తిగా దూరమైన లాస్య బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అవ్వటంతో బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత తన భర్త తో కలిసి అనేక టీవీ షోస్ లో పాల్గొనింది. లాస్య బుల్లితెర మీద కనిపించకపోయినా కూడ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లాస్యతన అందమైన ఫోటోలు షేర్ చేయడంతో పాటు భర్త స్నేహితులతో కలిసి చేసే ఫన్నీ రీల్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇటీవల లాస్య తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటికే లాస్య మంజునాథ్ ప్రేమకు గుర్తుగా జిన్ను అనే బాబు ఉన్నాడు. ఇక మరొకసారి లాస్య తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో తన భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ కి సంబందించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ… మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అంటూ రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు లాస్యకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.