దర్శకుడితో ప్రేమలో పడిన కుష్బూ.. అందరి ముందు ప్రేమ విషయాన్ని బయట పెట్టేసిందిగా…!

అలనాటి అందాల నటి కుష్బూ గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన కుష్బూ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం కుష్బూ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రధాన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇటీవల బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్న కుష్బూ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఇంద్రజ తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో వీరిద్దరూ కూడా కంటెస్టెంట్ల మీద రివర్స్ పంచులు వేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు.

ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈవారం జరగబోయే ఎపిసోడ్ లో కుష్బూ తన ప్రేమ వ్యవహారం బయటపెట్టింది. కుష్బూ తమిళ దర్శకుడు సుందర్ సి. నీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా తమిళంలో మంచి గుర్తింపు పొందిన సుందర్ `మురై మామన్‌` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో ఖుష్బూ ని చూసి ఫిదా అయ్యి కుష్బూ కి లవ్‌ ప్రపోజ్‌ చేశాడట. అయితే ఖుష్బూ కూడ ఆయన ప్రేమకి పడిపోయింది.

ఇక ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ లో రాకింగ్ రాకేష్ , సుజాత ఇద్దరు కలిసి స్కిట్ చేశారు. స్కిట్ అయిపోయిన తర్వాత వారిద్దరూ కుష్బూ ప్రేమ విషయం చెప్పమని అడగగా.. కుష్బూ తన లవ్ స్టోరీ గురించి వివరించింది. ఆ తర్వాత రాకేష్… కుష్బూ భర్తకు ఫోన్ చేయమని అడగ్గా జబర్దస్త్ సెట్ లోనే కుష్బూ తన భర్త సుందర్ కి ఫోన్ చేసింది. అయితే కుష్బూ తన ఫోనులో సుందర్ నంబర్ ని స్వీట్ హార్ట్ గా సేవ్ చేసుకుంది. దీంతో అక్కడున్న వారందరూ గట్టిగా కేకలు వేసి రచ్చ చేశారు. ఈ పరిణామంతో కుష్బూ కూడా సిగ్గు పడిపోయింది.