దమ్ము ధైర్యం గురించి మరోసారి రెచ్చిపోయి మాట్లాడిన ఆర్పీ.. ముదురుతున్న వివాదం?

కిరాక్ ఆర్పీ జబర్దస్త్ శ్యాం ప్రసాద్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదాలలో చిక్కుకున్నారు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం అలాగే మల్లెమాల వారి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదానికి దారితీసాయి. జబర్దస్త్ కమెడియన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శక నిర్మాతలు కూడా తీవ్రంగా ఖండించారు. ఆర్పి జబర్దస్త్ కార్యక్రమం కన్నా ఈ ఇంటర్వ్యూ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి కడుపున పుట్టిన శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తండ్రి అంటే ఏమాత్రం గౌరవం విలువలు లేవంటూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడంతో ఇది కాస్త వివాదానికి దారి తీసింది.

తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నాను నాకు తెలుసు.ఇండస్ట్రీలో ఎదగడం కోసం బాత్రూంలు కడగడంతో పాటు ఆఫీస్ బాయ్ గా పని చేయడమే కాకుండా ఎంతో మందికి మందు పోసానో వారి చేత తన్నులు కూడా తిన్నాను. నేను బాత్రూంలు కడిగాను మీరు మాత్రం మీ మనసులు కడుక్కోండి అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. ఇకపోతే నన్ను తొక్కేస్తారని అంటున్నారు ఆయన తొక్కేస్తారని తెలిసినప్పుడు తొక్కకుండా చూసుకోవడమే మనిషి జాగ్రత్త అంటూ ఆర్పి రెచ్చిపోయారు.

శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి నేను చాలెంజ్ విసురుతున్న ఆయన ఏం చేస్తారో చేసుకోనివ్వండి నా సినిమాలను ఆపుతారా, నా వెబ్ సిరీస్ లను ఆపుతారా, లేక నా యూట్యూబ్ ఛానల్ ను ఆపుతారా? ఏం చేస్తారో చేయనివ్వండి. లేకపోతే నా ఊపిరి కూడా ఆపేస్తారా మీరేం చేస్తారో చేసుకోండి మా ఇంట్లో బౌన్సర్లు కూడా లేరు.. చంపుకో సరైన శత్రువు చేతిలో మరణించడం కంటే గొప్ప వరం లేదని శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.