ఇమ్ము – వర్ష మద్య ప్రేమ కథ కంచికి చేరినట్టేనా..?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి ప్రేక్షకులలో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ షోద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంతేకాకుండా ఈ కామెడీ షో ద్వారా ఎన్నో ప్రేమ జంటలు కూడా తెరపైకి వచ్చాయి. మొదటగా ఈ షో ద్వారా సుధీర్ రష్మీ జంట బయటకి వచ్చింది. సుధీర్ రష్మీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని.. జబర్దస్త్ స్టేజ్ మీద ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడమే కాకుండా ఏకంగా రెండు మూడు సార్లు పెళ్లి కూడా చేసుకోవడంతో వీరిద్దరి మధ్య ప్రేమ నిజమనుకున్నారు. కానీ వీరి ప్రేమ కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసం మాత్రమే అని అందరికీ అర్థమైపోయింది.

ఇక సుధీర్ రష్మి జంట తర్వాత జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన మరొక జంట ఇమాన్యుల్- వర్ష జంట. వీరిద్దరూ లవ్ బర్డ్స్ లాగా జబర్దస్త్ స్టేజ్ మీద కలిసి స్కిట్లు చేయడమే కాకుండా ఇతర టీవీ షోలో కూడా జంటగా కనిపిస్తూ సందడి చేశారు. వీరిద్దరూ కూడా జబర్దస్త్ వేదికగా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడమే కాకుండా మల్లెమాలవారు ఏకంగా పెళ్లి కూడా జరిపించేశారు. వీళ్ళిద్దరి జోడి మీద ప్రేక్షకులకు మొదటినుంచి అనుమానం ఉన్నా కూడా వీరు వ్యవహరించే తీరు చూసి నిజంగానే వీరిద్దరూ ప్రేమికులని భావించారు.

ఇదిలా ఉండగా కొంతకాలంగా వర్ష ఇమాన్యుల్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జబర్దస్త్ స్టేజ్ మీద కలిసి స్కిట్ చేయడం లేదు. అంతేకాకుండా ఇద్దరూ కూడా వేరు వేరు స్కిట్ లలో చేయడమే కాకుండా ఇమాన్యుల్ కూడా వర్ష అని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఇటీవల విడుదలైన ‘ శ్రీదేవి డ్రామా కంపెనీ’ కొత్త ఎపిసోడ్ ప్రోమోలో … ‘నువ్వంటే ప్రాణమని.. నీతోనే లోకమని’ అంటూ ఇమాన్యుల్ ఎమోషనల్ సాంగ్ పాడాడు . ఈ ఫెర్ఫామెన్స్ జరుగుతున్నంతసేపు కూడా వర్ష ఎమోషనల్ అయినట్లు కనిపించింది.ఇక వర్ష స్టేజి పైకి వచ్చిన తర్వాత ‘ఏమైంది?’ అని జడ్జి ఇంద్రజ అడగ్గా.. ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఆ తర్వత తర్వాత ‘అప్పటికి ఇప్పటికే మీ మధ్య ఏం మారలేదా?’ అని యాంకర్ రష్మీ అడగ్గా.. అది ఎప్పటికీ మారదేమో అనిపించింది. అందుకే ఇలా..’ అంటూ ఇమ్ము ఎమోషనల్ అయ్యాడు.