అనసూయ తరచు విమర్శలు ఎదుర్కోవడానికి ఆ దోషమే కారణమా…?

బుల్లితెర మీద గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ తో పాటు బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా బుల్లితెర యాంకర్ గా గ్లామర్ షో చేస్తూ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ కి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. క్షణం, రంగస్థలం వంటి సినిమాల ద్వారా వైవిధ్యమైన పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందిన అనసూయ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తోంది.

ఇక అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచు తన అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అనసూయ ఇలా గ్లామర్ షో చేస్తూ అందరిని ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఆమె పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అనసూయ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా తనదైన శైలిలో విమర్శకులకు గట్టిగా కౌంటర్లు ఇస్తూ మరింత రెచ్చిపోయి అందాల విందు వడ్డిస్తోంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఆంటీ అన్నందుకు పోలీస్ కేసు పెడతానంటూ తెగ రచ్చ చేసింది.

ఇలా తరచూ వివాదాల్లో నిలుస్తున్న అనసూయ ఇటీవల తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే అనసూయ ఇలా తరచూ వివాదాల్లో నిలవడానికి ఆమె జాతకమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ జాతకంలో ఉన్న దోషం వల్లనే ఆమె తరచూ ఇలా వివాదాల్లో చిక్కుకుంటుందని జ్యోతిష్యులు వెల్లడించినట్లు సమాచారం. అందువల్ల అనసూయ ఆమె జాతకంలోని దోషాన్ని తొలగించుకోవడానికి పరిహార పూజ చేయించుకోవాలని జ్యోతిష్యులు వెల్లడించినట్లు సమాచారం. ఇక ఈ వార్త తెలుసుకున్న అనసూయ అభిమానులు తొందరగా ఆ పూజలు చేయించుకోమని అనసూయకు సలహా ఇస్తున్నారు. జాతకంలోని దోషాన్ని తొలగించుకొని మునుపటి అనసూయలా మారిపోవాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.