చెత్త షోలు చేయడం అవసరమా.. రష్మికి షాక్ ఇచ్చిన నేటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మీ!

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ రష్మీ. ఒకప్పుడు ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరించేది.అయితే సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా కొనసాగుతున్నారు.అయితే వరుస సినిమా అవకాశాలతో అనసూయ కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ వారానికి మూడు రోజులు పాటు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఈ మూడు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఈమె భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్ లు రష్మి పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ తన గురించి కామెంట్లు చేస్తుంటారు.ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మికి నేటిజన్ నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఈమెకు ఒక నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.జబర్దస్త్ లాంటి చెత్త షోలు చేయడం అవసరమా వీటిని మానేసి ఏదైనా మంచి సినిమాలు చేసుకొని హీరోయిన్ గా ఇండస్ట్రీలో స్థిరపడొచ్చు కదా అంటూ ప్రశ్న ఎదురైంది. ఇలా తనకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో రష్మి ఈ ప్రశ్నల పై స్పందిస్తూ నేటిజెన్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

నా వద్ద చాలా స్క్రిప్స్ ఉన్నాయి నేను సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను ఆ సినిమాలకు నువ్వు నిర్మాతగా వ్యవహరిస్తావా… సినిమా కోసం డబ్బు పెడతానంటే చెప్పు టీవీ షోస్ వదిలేసి వెంటనే సినిమాలు చేస్తా అంటూ ఈమె తనదైన స్టైల్ లో కౌంటర్ ఇవ్వడంతో ఆశ్చర్య పోవడం నేటిజన్ వంతు అయింది. ఇలా తన గురించి కామెంట్ చేసిన నేటిజన్ లకు రష్మీ తనదైన స్టైల్ లోనే సమాధానం చెప్పింది.