ఆ కమెడియన్ చేసిన పనికి షో మధ్యలో నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ.. వీడియో వైరల్..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జబర్దస్త్ స్టేజ్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది కమెడియన్లు వెండితెరపై అవకాశాలను అందుకుని రాణిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత రెండు మూడు ఎపిసోడ్ లుగా జబర్దస్త్ షోలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. అందుకు గల కారణం జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఒక్కొక్క కమెడియన్ మళ్ళీ జబర్దస్త్ షోలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

కాగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో ఎపిసోడ్ కి ఎంటర్టైన్మెంట్ పెరుగుతూ పోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. అందులో జడ్జిలుగా ఇంద్రజ,కుష్బూ వ్యవహరించారు. అయితే ఈ ప్రోమో లోకి కెవ్వు కార్తీక్ పై జడ్జి ఇంద్రజ సీరియస్ అయి కోపంగా షో జరుగుతుండగానే మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెవ్వు కార్తీక్ జడ్జిల వల్ల టీం లీడర్లు ఎటువంటి బాధలు పడుతున్నారు అన్న కాన్సెప్ట్ ని తీసుకొని స్కిట్ రూపంలో చేశాడు. ఈ క్రమంలోనే జడ్జిలు అయినా కుష్బూ క్యారెక్టర్ పొట్టి నరేష్ చేయగా ఇంద్రజ క్యారెక్టర్ ను వేరే అమ్మాయి చేసింది.

అయితే జరుగుతున్నంత సేపు పగలబడి నవ్విన ఇంద్రజ కిట్టు పూర్తి అవ్వగానే ఏంటి కార్తీక్ ఇది అంటూ ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. జడ్జిల వల్ల టీం లీడర్స్ ఏ విధంగా సఫర్ అవుతున్నారో ఈ స్కిట్ రూపంలో చూపించారు కదా నెక్స్ట్ స్కిట్ లో టీం లీడర్ల వల్ల జడ్జిలు ఎంత సఫర్ అవుతున్నారో చేసి చూపించండి అప్పుడు మీ స్కిట్ కి నేను మీకు జడ్జిమెంట్ ఇస్తాను అంటూ సీరియస్ అయ్యి షో మధ్యలోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ప్రోమో ని చూసిన నెటజన్స్ ఇప్పటికే ఇటువంటి ప్రోమోలను చాలా చూశాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంద్రజ నిజంగానే కెవ్వు కార్తిక్ పై సీరియస్ అయ్యిందా? లేదంటే ఇది టీఆర్పీలో భాగమా అన్నది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.