నా ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఇంట్లో అంట్లు తోముకుంటా: అనసూయ

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట న్యూస్ ప్రజెంట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనసూయ మ్యూజిక్ చానల్స్ లో కూడా యాంకర్ గా పని చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకొని యాంకర్ గా సెటిల్ అయ్యింది. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ బాగా పాపులర్ అయింది. ఈ షో లో అనసూయ తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఈ క్రమంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.

ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ జబర్థస్త్ నుండి బయటికి వచ్చింది. దాదాపు 9 సంవత్సరాల పాటు అనసూయకు జబర్దస్త్ తో మంచి అనుబంధం ఉంది. అయితే సినిమా అవకాశాలు రావటంతో ఇలా జబర్దస్త్ కు దూరం కావలసి వచ్చింది. జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన తర్వాత అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ.. జబర్దస్త్ వదిలేసినప్పుడు టీవీ ఇండస్ట్రీకి దూరమవుతానేమో అని భయం వేసింది. ఇళ్లు వదిలి వెళ్తున్నప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో నాకు కూడా అలాగే అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఇండస్ట్రీలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. తొందరగా పైకి ఎదగాలనుకునేవారు చెడుని ఎంచుకోవచ్చు ఎవరి ఇష్టం వారిది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు , ఈ అందమైన ప్రపంచంలో మీకు ఎవరూ నచ్చలేదా అని అడగ్గా..నేను సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినని, భయపడుతూనే ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నాకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ , నా ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి ఉంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండను అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ లో నాకు కానీ, నా నా ఆత్మ గౌరవానికి కానీ ఆటంకం కలుగుతుంది అనుకుంటే హెచ్ ఆర్ గా ఉద్యోగం చేసుకొని బ్రతుకుతా లేదంటే ఇంట్లో అంట్లు తోముకొని బ్రతుకుతాను అంటూ వెల్లడించింది.