నాకో వ్యాధి ఉంది, అందుకే ఎవరినీ లెక్క చేయను.. వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో అనసూయ కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనసూయ ఆ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఇలా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షో లలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని ఫుల్ బిజీగా ఉంది. చిట్టి బావ అవకాశాలు ఎక్కువ రావటం అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ గోల్డ్ గా ఉంటూ తన గురించి నెగటివ్ కామెంట్స్ చేసేవారికి కౌంటర్స్ ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇలా అనసూయ యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. సోషల్ మీడియాలో తన గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్, మీమ్స్ తనపై ప్రభావం చూపవు అని చెబుతూ తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనసూయ..” నాకు ఓ డిజాస్టర్ ఉంది. ఏమిటంటే నిజాలు చెప్పడం, నెగిటివ్ పీపుల్ ని లెక్క చేయకపోవడం ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొంతమంది పాజిటివ్గా స్పందిస్తుంటే మరి కొంత మంది మాత్రం ఎప్పటిలాగే నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ విషయానికి వస్తే.. యాంకరింగ్ కి పూర్తిగా దూరమైన అనసూయ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల అనసూయ నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. పుష్ప 2 లో కూడా అనసూయ ఒక కీలక పాత్రలో నటించనుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. బుల్లితెర మీద తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే అనసూయ వెండితెర మీద మాత్రం తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.