తిండి లేక పస్తులు ఉండేవాళ్ళం… అందుకోసమే తాను స్మశానానికి వెళ్లేవాడిని: రాకింగ్ రాకేష్

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఈయన మొదట్లో చిన్న పిల్లలతో స్కిట్లు చేస్తూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిన రాకింగ్ రాకేష్ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక ఈయన మరొక జబర్దస్త్ నటి జోర్దార్ సుజాతతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అందరికీ తెలిసిందే.

ఈ విధంగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో వీరి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాకింగ్ రాకేష్ తన కన్నీటి కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఒకానొక సమయంలో తినడానికి తిండి లేక పస్తులు పడుకున్న రోజులు చాలా ఉన్నాయని ఈయన తెలిపారు.మిమిక్రీ చేసుకుంటూ ఇండస్ట్రీలో ఆఫీసులో చుట్టూ సుమారు 11 సంవత్సరాలు పాటు కష్టపడ్డానని తెలిపారు.

ఏదైనా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్లు ఇచ్చినదే మహాభాగ్యంగా భావించి తీసుకొని వెళ్లేవాడిని. ఇలా మిమిక్రీ ఆర్టిస్టుగా ఉన్న తనకు ధనరాజ్ అన్న జబర్దస్త్ అవకాశం కల్పించారని నేను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు కారణం ధనరాజ్ అన్ననే అంటూ రాకేష్ తెలిపారు. అయితే ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తాను స్మశానంలోకి వెళ్లి పడుకునే వాన్ని అక్కడే తనకు మానసిక ప్రశాంతత దొరుకుతుందని రాకేష్ తెలిపారు.ఇప్పటికీ అప్పుడప్పుడు మానసిక ప్రశాంతత కోసం స్మశానానికి వెళ్తూ ఉంటానని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.