రెమ్యునరేషన్ పెంచినా కూడా జబర్థస్త్ నో చెబుతున్న ఆది… ఆ టెన్షన్ భరించలేకే?

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న కామెడీ షోలలో జబర్దస్త్ కామెడీ షో అగ్రస్థానంలో ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా గుర్తింపు పొంది ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా పొందిన గుర్తింపు వల్ల హైపర్ ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న అనేక టీవీ షోస్ ప్రత్యేక కార్యక్రమాలలో అవకాశాలు పొందటమే కాకుండా సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటున్నాడు. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నాడు.

ఇలా వరస సినిమాలు, టీవీ షోస్ తో బిజీగా ఉన్న హైపర్ ఆది కొంతకాలం క్రితం జబర్దస్త్ కి దూరం అయ్యాడు.అయితే అది తో పాటు సుధీర్, అనసూయ వంటి వారు కూడా జబర్దస్త్ కి దూరమయ్యారు. అయితే సుధీర్ అనసూయ జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే సింగింగ్ షోలో యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ అది మాత్రం జబర్దస్త్ లో కనిపించకపోయినప్పటికీ ఈ టీవీలో ప్రసారమవుతున్న ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో సందడి చేస్తూ పక్క ఛానల్ వారు అధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా వెళ్లటం లేదు.

అయితే ఇలా ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లతో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తున్న ఆది జబర్దస్త్ కి తిరిగి రప్పించటానికి ఇటీవల మల్లెమాల వారు ఇప్పుడు ఇస్తున్న రెమ్యునరేషన్ కన్నా 30 నుండి 40 శాతం ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చినా కూడ ఆది జబర్థస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎందుకంటె జబర్థస్త్ లో టీమ్ లీడర్ గా ఆది స్కిట్ రాయాల్సి ఉంటుంది. దాని కోసం ఎక్కువ సమయం పట్టడమే కాకుండా మెంటల్ టెన్షన్ కూడా ఉంటుంది. ఆది కి ఉన్న బిజీ షెడ్యూల్ లో జబర్దస్త్ స్కిట్ రాయటం కోసం టైం వేస్ట్ అవ్వటమే కాకుండా మెంటల్ టెన్షన్ ఉండటం వల్ల ఆది జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడో ఒకసారి కచ్చితంగా జబర్దస్త్ రీ ఎంట్రీ ఇస్తానని ఆది వెల్లడించాడు.