జబర్థస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు ఇదివరకే తెలుగు సీరియల్స్ లో నటించిందని తెలుసా…?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో 9 సంవత్సరాలుగా ప్రసారమవుతూ ప్రేక్షకులను నవ్విస్తూ నెంబర్ వన్ కామెడీ షో గా నిలిచింది. ఈ కామెడీ షో కి ధీటుగా ఎన్ని కామెడీ షో లు వచ్చినా కూడా జబర్దస్త్ ని అధిగమించలేకపోయాయి. ఇక ఈ కామెడీ షో ద్వారా జడ్జిలు యాంకర్లు కమెడియన్లు అందరూ బాగా ఫేమస్ అయ్యారు. హీరోయిన్ రోజా ఈ కామెడీ షో ద్వారా జడ్జిగా పాపులర్ అవ్వగా.. నాగబాబు కూడా నటుడిగా కన్నా జడ్జిగానే ఫేమస్ అయ్యాడు. అలాగే ఈ కామెడీ షో ద్వారా అనసూయ రష్మీ కూడా యాంకర్లుగా బాగా ఫేమస్ అయ్యి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటున్నారు.

అయితే ఇటీవల అనసూయ జబర్దస్త్ కి దూరం కావటంతో అనసూయ స్థానంలో రష్మి జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతోంది.అయితే జబర్దస్త్ లో అనసూయ స్థానంలో రష్మి కాకుండా మరొక కొత్త యాంకర్ ని పరిచయం చేశారు. సౌమ్య రావు అనే ఆమె జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చేవారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వండి. ఇక ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ జబర్దస్త్ కొత్త యాంకర్ గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. కన్నడ, తమిళ సీరియల్స్ లో నటిస్తూ నటిగా గుర్తింపు పొందిన సౌమ్యారావు తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ లో కూడా నటించింది.

ఇలా కన్నడ తమిళ్ భాషలలో మంచి గుర్తింపు పొందిన సౌమ్యరావు ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్ లో విలన్ క్యారెక్టర్ లో నటించే అవకాశం అందుకుంది. ఇలా సీరియల్ లో విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌమ్య రావు కి జబర్థస్త్ యాంకర్ గా మల్లెమాల అవకాశం ఇచ్చింది. ఇలా జబర్దస్త్ యాంకర్ గా అవకాశం అందుకున్న సౌమ్యారావు అందంలో అనసూయ రష్మిని వెనక్కి నెట్టేలా ఉన్నా కూడా యాంకరింగ్ విషయంలో ఆ సీనియర్ యాంకర్ల స్థాయికి చేరి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ? లేదో ? చూడాలి మరి.