భాను శ్రీ మనసులో అంత ఉందా?.. శ్రీముఖికి వెన్నుపోటు పొడిచింది!!

అదిరింది షో గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌కు పోటిగా నితిన్ భరత్ అనే డైరెక్టర్లు అదిరింది అనే షోను ప్రారంభించారు. నాగబాబు సాయంతో అదిరింది షోను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ షోకు మొదటగా సమీర అనే లేడీ యాంకర్‌గా ఉండేది. ఆ తరువాతు ఆమె స్థానంలో భాను శ్రీని తీసుకున్నారు. 25 ఎపిసోడ్‌లు నిరంతరాయంగా సాగింది. 25 ఎపిసోడ్‌లు తరువాత అదిరింది షో కాస్త బొమ్మ అదిరిందిగా మారింది.

Bhanu Sri Backstabbing Sreemukhi In Bomma Adirindhi
Bhanu Sri Backstabbing Sreemukhi In Bomma Adirindhi

బొమ్మ అదిరింది షోలో భాను శ్రీని తీసేసి శ్రీముఖిని యాంకర్‌గా పెట్టుకున్నారు. అలా భానును యాంకర్‌గా తీసేయడంపై బాగానే హర్ట్ అయినట్టుంది. ఈ మేరకు ఆ మధ్య ఓ అభిమాని షేర్ చేసిన కామెంట్‌ను పోస్ట్ చేసింది. బొమ్మ అదిరిందిలో మళ్లీ యాంకరింగ్ చేయండని ఫ్యాన్స్ కోరుతున్న కామెంట్లను భాను శ్రీ పోస్ట్ చేసింది. అంటే తన మనసులో కూడా అదే ఉందని చెప్పకనే చెప్పేసింది.

Bhanu Sri Backstabbing Sreemukhi In Bomma Adirindhi
Bhanu Sri Backstabbing Sreemukhi In Bomma Adirindhi

ఇక తాజాగా చిరంజీవి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి ఈవెంట్‌లో భాను శ్రీ తన మనుసులో విషయాన్ని బయటపెట్టేసింది. శ్రీముఖి ప్రదీప్‌కి రాసిన లెటర్ చదువుతానని చెబుతూ.. తన మనసులోని భావాన్ని బయటపెట్టేసింది భానుశ్రీ. బొమ్మ అదిరింది షోలో శ్రీముఖిని యాంకర్‌గా తీసేసి తనను పెట్టుకోండనే అర్థం వచ్చేట్టుగా ఆ లెటర్‌ను మార్చేసింది. దీంతో అలా మార్చి చదవడంతో శ్రీముఖి దెబ్బకు షాక్ అయింది. మొత్తానికి ఇలా వచ్చిన అవకాశంతో భానుశ్రీ తన మనసులో కోరికను బయటపెట్టేసింది.