యాంకర్ సుమ షాకింగ్ డెసిషన్…ఆందోళనలో అభిమానులు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు సుమ కనకాల. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందిన సుమ ఇప్పటికీ వరుస టీవీ షోలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో యాంకరింగ్ చేస్తూ తన మాటల గారడి తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుమకి పోటీగా ఎంతోమంది కొత్త యాంకర్లు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ.. వారు సుమ ని దటలేకపోతున్నారు. అనసూయ, రష్మి వంటి వాళ్లు కూడా యాంకరింగ్ తో పాటు గ్లామర్ జోడించడం కూడా సుమ కి ధీటుగా నిలబడలేకపోతున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న సుమ డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేసి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇలా యాంకర్ గా, నటిగా బిజీగా ఉండే సుమ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి నెటిజన్స్ ని ఆకట్టుకుంటూ అక్కడ కూడా తన ముద్ర వేసుకుంది. ఇలా సక్సెస్ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్న ఇటీవల తన అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈటీవీ వాళ్ళు వేర్ ఈజ్ ద పార్టీ అనే ఓ స్పెషల్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బుల్లితెర నటి నటులతో పాటు కమెడియన్లు కూడా పాల్గొని తెగ సందడి చేశారు. ఇక ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న యాంకర్ సుమని ఈటీవి వారు సన్మానించారు. తన ప్రతిభను గుర్తిస్తూ తనని సన్మానించిన సందర్భంగా సుమ తన జీవితంలోని కొన్ని ఆస్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.

అంతే కాకుండా యాంకర్ గా తన జీవితంలో ఎదురైన మంచి,చెడు అనుభవాలను కూడా తన అభిమానులతో పంచుకుంది. యాంకర్ గా, నటి గా తనని ఇప్పటివరకు ఆదరించిన అభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ.. ఇక ఇప్పటినుండి తాను కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెబుతూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన సుమ అభిమానులు సుమా తన యాంకరింగ్ కి గుడ్ బై చెప్పబోతుందా..? అని ఆందోళన పడుతున్నారు. ఇలా సుమ తన యాంకరింగ్ కెరీర్ కి పూర్తిగా బ్రేక్ ఇస్తుందా..? లేక కొంత కాలం మాత్రమే విరామం తీసుకుంటుందా అని చర్చించుకుంటున్నారు.